సినీ ఇండస్ట్రీకి చెందిన సింగర్ యోయో హనీ సింగ్ గురించి అందరికీ పరిచయమే.తన పాటలతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అంతేకాకుండా పలు సినిమాలలో కూడా నటించాడు.ఇక 2011లో ఈయన శాలిని సింగ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఈమె తన భర్త గురించి కొన్ని ఆరోపణలు చేయడంతో.తిరిగి తన భార్యపై కంప్లైంట్ ఇచ్చాడు హనీసింగ్.
తనను తన భర్త మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేసింది శాలిని.తన భర్తకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని.అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా తనను వేధిస్తున్నారని తెలిపింది.దీంతో అతనిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు అయింది.
అంతేకాకుండా తనకు తన భర్త నుండి భారీగా పరిహారం కూడా ఇప్పించాలని కోర్టును కోరింది.అలా కొన్ని ఫిర్యాదు చేసిన తనపై.
తాజాగా తన భర్త హనీ సింగ్ కూడా ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
తన భార్య శాలిని తనపై చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి నిజం లేదని తెలిపాడు.
తనపై తన భార్య చేసిన ఆరోపణల వల్ల తీవ్రంగా బాధ పడ్డానని తెలిపాడు.తనపై, తన కుటుంబ సభ్యులపై అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తుందని.
అంతేకాకుండా ఆమె చేసే వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని తెలిపాడు.ఇక తను ఎప్పుడూ తన ఆరోగ్యం పై, తన పాటలపై వచ్చిన పుకార్లను కూడా స్పందించలేదని అంతేకాకుండా తన గురించి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కూడా స్పందించలేదని తెలిపాడు.
కానీ ఇప్పుడు మాత్రం తన భార్య చేసిన ఆరోపణల వల్ల ఇక తాను మౌనంగా ఉండకూడదని అనుకున్నానని తెలిపాడు.షాలిని తన వ్యాఖ్యలతో తన కుటుంబాన్ని, తన చెల్లిని బయటకి లాగుతుందని తెలిపాడు.
ఆమె చెప్పే మాటలు వల్ల తమ పరువుకు భంగం కలిగిందని.తను 15 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో ఉంటూ దేశవ్యాప్తంగా సంగీత కళాకారులతో పని చేశానని తెలిపాడు.అలా తన భార్యతో తాను ఏ విధంగా ఉంటాననేది తన సిబ్బందులకు తెలుసని.ఏ కార్యక్రమంలోకి వెళ్లిన తనను తీసుకొని వెళ్ళేవాడిని అని తెలిపాడు.దీంతో ఆమె తనపై చేసిన ఆరోపణలో నిజం లేదని. తనకు దేశ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, తొందర్లోనే అసలు విషయం బయట పడుతుందని తెలిపాడు హనీసింగ్.