తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకుడు మాటల మాంత్రికుడు అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ లలో ఇతను కూడా ఒకరు.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య శ్రీనివాస్ క్లాసికల్ డాన్సర్ అన్న విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు.ఇప్పటికే పలుసార్లు ప్రదర్శనలు ఇచ్చిన ఆమె తాజాగా మీనాక్షి కల్యాణం అనే శాస్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇవ్వబోతోంది.
ఈ నృత్య ప్రదర్శన డిసెంబర్ 2న జరగాల్సి ఉండగా, సౌజన్య బాబాయి.పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకస్మాత్తుగా మరణించడంతో ఈ నాట్య ప్రదర్శన17 వ తేదీకి వాయిదా వేశారు.
అయితే సౌజన్య నాట్య ప్రదర్శన రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి శిల్పకళావేదికలో జరగనుందట.అయితే ఈ కార్యక్రమానికి పసుమర్తి రామలింగ శాస్త్రి దర్శకత్వం వహించనున్నారు.
ఈ ఈవెంట్ ను హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలిసి ఈ ఈవెంట్ ను అందిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు.దీనితో ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఈ కార్యక్రమం పై పడింది.అంతేకాకుండా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సైతం హాజరుకానున్నారు.
వీరితో పాటుగా తనికెళ్ల భరణి, వసంత లక్ష్మి నరసింహ చారి, త్రివిక్రమ్ శ్రీనివాస్, చుక్కపల్లి సురేష్, సతీష్ చంద్ర గుప్తా తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు కూతురు సౌజన్యను పెళ్లి చేసుకున్నాడు .ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.