యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర షూటింగ్ చివరిదశకు రావడంతో ఈ సినిమా రిలీజ్పై ఫోకస్ పెట్టాడు.ఇక ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులతో పాటు సినీ జనాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో తన నటవిశ్వరూపాన్ని చూపించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.ఇక ఈ సినిమా తరువాత తారక్ తన కెరీర్లో 30వ చిత్రాన్ని ఇప్పటికే అఫీషియల్గా అనౌన్స్ చేశాడు.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను అనౌన్స్ చేసిన తారక్, ఇంకా షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు.
దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే తారక్ ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించే సూచనలు కనిపించడం లేదు.
దీనికి తారక్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ముఖ్య కారణమని తెలుస్తోంది.ఈ షోను ఇటీవల ప్రారంభించిన తారక్, ఈ షోను పూర్తయ్యే వరకు ఎలాంటి సినిమా షూటింగ్ను ప్రారంభించేందుకు రెడీగా లేడట.
ఇక కొరటాల శివతో చేయబోయే సినిమా కోసం తారక్ పూర్తి మేకోవర్ చేయనున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ సినిమాను ప్రారంభించే సమయానికి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోను ముగించేసుకుని, తారక్ మేకోవర్ కూడా చేస్తాడట.
ఇలా తన నెక్ట్స్ మూవీ కోసం ఈ షో అడ్డంకిగా మారుతుందిన తారక్ ఊహించలేదని, అందుకే వీలైనంత త్వరగా ఈ షోను ముగించాలని తారక్ ప్లా్న్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విమర్శకులు.
కాగా కొరటాల శివతో తారక్ చేయబోయే సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేయనున్నాడు.