మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ నుండి త్వరలో సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్‌

అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుని విడుదలకు సిద్దం అయిన సమయంలో కరోనా కారణంగా మొత్తం సీన్‌ రివర్స్‌ అయ్యింది.సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలనుకున్న చిత్ర యూనిట్‌ సభ్యులకు షాక్‌ తలిగింది.

 Telugu Film News-TeluguStop.com

బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రం విడుదలకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
షూటింగ్‌ను సెప్టెంబర్‌ వరకు పూర్తి చేయాలని వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు.వచ్చే నెలలో సినిమా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేయాలని భావిస్తున్నారు.

అందుకు సంబంధించి ఇప్పటికే టీజర్‌ను కట్‌ చేశారు.వచ్చే నెలలో మంచి సందర్బం చూసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌

ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.ఇప్పటి వరకు అఖిల్‌ నటించిన మూడు సినిమాలు కూడా తీవ్ర నిరాశ పర్చాయి.కనుక ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్‌ చాలా హోప్స్‌ పెట్టుకుని ఉన్నారు.మరి వారి అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందా అనేది చూడాలి.అఖిల్‌ కూడా చాలా ఆసక్తిగా ఈ చిత్రం ఫలితం కోసం ఎదురు చూస్తున్నాడట.అల్లు అరవింద్‌ ఈ సినిమాను సమర్పిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube