మునుగోడులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్న ఎమ్మేల్యే

నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy )భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు.

మునుగోడు మండల కేంద్రంలో పలు ప్రదేశాలను ఆయన పరిశీలించారు.

అనంతరం ఆర్టీసీ బస్టాండ్ దాని ముందే ఉన్న కూరగాయల అంగడి, పోలీస్ స్టేషన్ భవనం, మునుగోడు ఎస్సీ బాలుర వసతి గృహ భవనం, ఒకేచోట అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేలా వాటికి అవసరమయ్యే స్థలం అన్నింటినీ కాలినడకన తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఓకే ప్రాంగణంలో ఉండే విధంగా మార్పులు చేయాలని,వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఒకే ప్రదేశంలో ఉండాలన్నారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు జరగాలన్నారు.డిగ్రీ, ఇంటర్,పాలిటెక్నిక్ లాంటి కళాశాలలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవాలని తన ఆలోచనలను,మండల నాయకులకు వివరించారు.

నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మునుగోడు పట్టణన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తన్నారు.కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దాంట్లో భాగంగానే మునుగోడు నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేయడానికి వాటికి కావాల్సిన ప్రపోజల్స్ని తొందరలోనే తెప్పించుకొని ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ కేంద్రంగా ఏర్పాటు చేస్తానని తెలిపారు.

Advertisement

మునుగోడు నియోజకవర్గాన్ని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలనే తన విజన్ ను మునుగోడు మండల ముఖ్య నాయకులకు వివరించడంతో శాసనసభ్యుల చిత్తశుద్ధికి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.ఆయన వెంట మునుగోడు మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు
Advertisement

Latest Nalgonda News