2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత సీఎం జగన్( CM Jagan ) సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇవ్వడం తెలిసిందే.అయితే అధికారంలోకి వచ్చాక దాన్ని నెరవేర్చక పోవడంపై టీడీపీ యువనేత లోకేష్( Nara Lokesh ) పాదయాత్రలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
లోకేష్ “యువగళం”( Yuvagalam ) పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీఎం జగన్ సంపూర్ణ మద్యపానం నిషేధం హామీ గురించి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే నిషేధిస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు తానే మద్యం తయారు చేస్తూ ప్రభుత్వ దుకాణాల పేరుతో అమ్ముకుంటున్నాడని విమర్శించారు.
ప్రమాదకరమైన జగన్ మద్యం పాలసీని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మారుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.అంతేకాదు ప్రభుత్వం కింద పని చేస్తున్న సిబ్బందికి టార్గెట్ పెట్టే పరిస్థితి నెలకొందని వైసీపీ ప్రభుత్వంపై( YCP ) మండిపడ్డారు.దీనివల్ల గ్రామాలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొంతమంది స్త్రీలు తమ దృష్టికి ఈ మధ్యపానం ( Alcohol ) విషయం తీసుకొచ్చి.కుటుంబాలు పాడవుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు లోకేష్ తెలిపారు.
సో ఈ మధ్యం పాలసీపై పునరాలోచన చేయాల్సిన అవసరం నెలకొంది.ఇప్పుడున్న పాలసీ కరెక్ట్ పాలసీ కానే కాదు.
దీనిలో ఎలాంటి సందేహం లేదు.అంటూ లోకేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.