ప్రస్తుతం కరోనా వైరస్ ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కంటికి కనబడని ఈ అదృశ్య వైరస్ ఎన్నో వేల మంది కుటుంబాలను కబలిస్తోంది.
కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.అయితే కరోనా నివారణకు ఎంత మంది ప్రయత్నిస్తున్నా సరైన నివారణ ఫార్ములా మాత్రం దొరకడం లేదు.
మొదటి దశ కరోనా వేవ్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదైనా, మరణాలు మాత్రం తక్కువగా నమోదయ్యాయి.కాని సెకండ్ వేవ్ లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది.
అయితే ఈ కరోనాకు మాత్రం ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యం సరిగ్గా పని చేయక పోవడంతో, ఇప్పుడు చాలా మంది పసరు వైద్యాన్ని నమ్ముకుంటున్నారు.కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యం విషయం బయటకు వచ్చిన తరువాత చాలా మంది కరోనాకు చెక్ పెట్టే పసరు వైద్యం తమ వద్ద కూడా ఉందని చెబుతున్న పరిస్థితి ఉంది.
ప్రస్తుతం అనందయ్య పసరు వైద్యం కాకుండా మరో పసరు వైద్యం కూడా అందుబాటులోకి వచ్చిందని కడప జిల్లా పులివెందులకు చెందిన అన్నదమ్ములు యాదాటి రామ గంగాధర యాదవ్, వివేకానంద యాదవ్ దగ్గర పసరు వైద్యం పొందిన వారు చెబుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే మూడు లక్షల మందికి కరోనా మందు ఇచ్చామని ఎవ్వరికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని వారు యాదాటి రామ గంగాధర యాదవ్, వివేకానంద యాదవ్ చెబుతున్నారు.