జై భీమ్ నినాదాలతో హోరెత్తిన ఉమ్మడి నల్లగొండ

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డాక్టర్ బి.ఆర్.

అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.

నల్లగొండలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికీ హక్కులు, బాధ్యతలు మరియు పాత్రలు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఫలితమని ఉద్ఘాటించారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలు మరియు మండలాల్లో అంబేద్కర్ విగ్రహాలకు,చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కొన్ని ప్రాంతాల్లో ఊరేగింపులు,అన్నదాన కార్యక్రమాలు మరియు పంచశీల జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.స్థానిక ప్రజా సంఘాలు,యువజన సంఘాలు మరియు రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు.

Advertisement
ఇదెక్కడి రోగం... మొబైల్‌లో అరగంటకన్నా ఎక్కువ మాట్లాడితే హై బీపీ వచ్చేస్తోంది?

Latest Nalgonda News