జాతీయ స్థాయి అథ్లేటిక్స్ పోటీలకు జతీన్ యాదవ్ ఎంపిక

నల్లగొండ జిల్లా: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వారణాశిలో అక్టోబర్ 6 నుంచి 10వ తేది వరకు నిర్వహించే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నాయనవానికుంట గ్రామానికి చెందిన నడ్డి జతిన్ యాదవ్ ఎంపికయ్యారు.

ఈ నెల 14 న నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏకశీల పాఠశాలలో నిర్వహించిన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి సీబీఎస్ఈ క్లస్టర్ 7 అథ్లెటిక్ 5 వేల (5 కి.

మీ) మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించాడు.ఆ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

జతిన్ యాదవ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల తల్లిదండ్రులు నడ్డి బాలరాజు యాదవ్, అంజలి,కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేయగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.

Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown
Advertisement

Latest Nalgonda News