నల్గొండ పట్టణంలో ఏ ఒక్క వార్డులో కూడా నా కంటే కోమటిరెడ్డికి ఎక్కువ ఓట్లు రాని కోమటిరెడ్డి తనకి నీతులు చెప్పడమేంటంటూ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం ఆయన తన స్వగృహంలో మీడియాలో మాట్లాడుతూ,
తన రాజీనామాతో ఏర్పడే ఖాళీని కోమటి సోదరులు ఆక్రమించుకునేందుకు కాంగ్రెస్లో పైరవీలు ప్రారంభించారని ఎద్దేవా చేసారు.పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్లు కాంగ్రెస్ను అన్ని విధాల మోసం చేస్తున్న విషయాన్ని అధినేత్రి సోనియా పట్టించుకోవాలని సూచించారు.
రూ.400 కోట్ల కాంట్టాక్టులు పొందానంటు తనపై ఆరోపణలు చేసే ముందు రూ.16వందల కోట్ల కాంట్రాక్టు పనులు ఒప్పందం కుదుర్చుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారంపై దృష్టి పెడితే వాస్తవాలు బైటపడతాయని అన్నారు.సీనియర్ నాయకుడు జానారెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం నచ్చని వారంతా ఓ చోట చేరారని, నిజాయితీ పార్టీ కోసం పనిచేసేవారిని వెళ్లగొట్టేందుకు యత్నిస్తున్నారని , వారితో గొడవలు పడడం నచ్చక తను బయటకు వచ్చానన్నారు గుత్తా.