1.మంత్రి బొత్స తో ఉపాధ్యాయ సంఘాల భేటీ

మంత్రి బొత్స సత్యనారాయణ తో ఉపాధ్యాయ సంఘాల నేతలు సమావేశం అయ్యారు.12 సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కు వెళ్తున్నారు.గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తున్నారు.
3.ఈటెల రాజేందర్ విమర్శలు

అసెంబ్లీ స్పీకర్ పై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు.అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ గొప్పగా నిర్వహించాలంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని ఈటెల రాజేందర్ సెటైర్లు వేశారు.
4.ఏపీ ప్రభుత్వంపై పురందరేశ్వరి విమర్శలు
వైసీపీ ప్రభుత్వం పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శలు చేశారు.టీటీడీ చైర్మన్ అన్నది రాజకీయ పునరావస పదవి కాదని పురందరేశ్వరి విమర్శించారు.
5.జగన్ పై సిపిఐ విమర్శలు

2025 నాటికి జగన్ సీఎం గా ఉంటారా అంటూ పోలవరం అంశంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.
6.ఎస్వీ యూనివర్సిటీలో కొనసాగుతున్న ఆందోళన
విద్యార్థి సంఘం నేతపై వైసీపీ నేతల దాడికి నిరసనగా ఎస్ వి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఈరోజు ఉదయం ఆందోళన నిర్వహించారు.తమ విద్యార్థి పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
7.నిండిన ఆల్మట్టి జలాశయం

కృష్ణా నదికి అనుబంధంగా ఉన్న విజయపుర జిల్లా నిడగుంది తాలూకా పరిధిలోని లాల్ బహదూర్ శాస్త్రి జలాశయం ( ఆల్మట్టి ) నిండింది.
8.బిజెపి రాష్ట్ర చీఫ్ పాదయాత్రకు బ్రేక్
తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నమాలై చేపట్టిన యాత్ర రెండు రోజులు వాయిదా పడింది. అన్నామలై తన పాదయాత్రలో స్వల్ప మార్కులు చేశారు.
9.కిమ్స్ హాస్పిటల్స్ లాభంలో 10 శాతం వృద్ధి

జూన్ తో ముగిసిన తొలి త్రైమాసికంలో కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( కిమ్స్ హాస్పిటల్స్ ) ఏకీకృత ప్రాతిపదికన 87 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
10.21 శాతం పెరిగిన రెయిన్ బో ఆదాయం
రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రులను నిర్వహిస్తున్న రెయిన్బో చిల్డ్రన్ మెడికల్ కేర్ లిమిటెడ్ జూన్ త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన 41.49 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
11.హెచ్ సీ ఏ ఎన్నికల అధికారిగా సంపత్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు నియమిత ఏకసభ్య కమిటీ సభ్యులైన జస్టిస్ లావు నాగేశ్వరావు కీలక నిర్ణయం తీసుకున్నారు.హెచ్సీఏ ఎన్నికల అధికారిగా జాతీయ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ ను నియమించారు.
12.పాక్ చీఫ్ సెలెక్టర్ గా ఇంజమామ్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్హాక్ ఆదేశ జాతీయ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ గా నియమితులయ్యారు.
13.ఆర్టీసీ ఉద్యోగుల భద్రత కోసమే విలీనం

ఆర్టీసీ ఉద్యోగుల భద్రత కోసమే వారిని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
14.మంత్రి కేటీఆర్ కామెంట్స్
కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వమే రాబోతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.
15.టీటీడీకి 5.11 కోట్ల విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానానికి 5.11 కోట్లు విరాళంగా అందాయి.
16.రఘురామకృష్ణంరాజు విమర్శలు
బద్ధకానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని వైసీపీ రెబెల్ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
17.జడ్జీలు ఆస్తులు వెల్లడించేలా చట్టం ఉండాలి

సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు ప్రతి యేట తమ ఆస్తుల వివరాలను వెల్లడించేలా చట్టం తీసుకురావాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
18.డిస్కం లకు 3,371 కోట్లు
నష్టాల భర్తీలో భాగంగా రాష్ట్ర డిస్కమ్ లకు 3,371 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
19.ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ

వరద బాధితులను ఆదుకోవాలంటే తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులు లేఖ రాశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,050
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 60,060
.






