ఎన్నికల్లో లబ్ధి కోసమే పవన్ ప్రాణహాని నాటకం.. మంత్రి అమర్నాథ్

చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మంత్రి అమర్నాథ్ తీవ్రంగా మండిపడుతున్నారు.రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు.గతంలో ఏపీ వైపు చూడని కంపెనీలు ఇప్పుడు చూస్తున్నాయన్నారు.

కళ్లు తెరిచి చూస్తే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనబడుతుందన్నారు.ఎన్నికల్లో లబ్ధి కోసమే పవన్ ప్రాణహాని ఉందంటున్నారు.

పవన్ కు చంద్రబాబు వల్లే ప్రాణహాని ఉంటుందని వెల్లడించారు.చంద్రబాబు ఏం చెబితే అది పవన్ మాట్లాడుతున్నారని, టీడీపీలో సెకండ్ క్యాడర్ నేతలు అనుమానాస్పదంగా చనిపోయారని విమర్శించారు.

Advertisement

వాళ్ల మృతిపై ఎవరిని అనుమానించాలని ప్రశ్నించారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

Latest Latest News - Telugu News