మునుగోడులో కాల్పుల కలకలం

నల్గొండ జిల్లా:మునుగోడు మండలం ఊకొండి శివారులో ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి.

బైకుపై వెళ్తున్న యువకుడిపై దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో బాధితుడికి తీవ్రగాయాలు కావడంతో అతడిని నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.భాదితుడు నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెళ్ళెంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు,దుండగుల కోసం వేట సాగిస్తున్నారు.

దేవరకొండ యువతి గిన్నిస్‌ బుక్‌ రికార్డు
Advertisement

Latest Nalgonda News