2019 డిసెంబర్ నెలలో చైనా దేశంలోని వుహాన్ లో విజృంభించిన కరోనా మహమ్మారి ఆ దేశం నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది.ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ పై ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా పడింది.
కేసుల సంఖ్య తగ్గుతున్నా మరికొన్ని రోజుల్లో చలికాలం రానుండటంతో మళ్లీ కేసులు, మరణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని.ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి సమయంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు మరో సంచలన విషయం వెల్లడించారు.కరోనా వైరస్ కూడా జలుబులాంటిదేనని మళ్లీమళ్లీ కరోనా సోకే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్త వెండీ బార్క్ లే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సహజంగా వచ్చే దగ్గు, జలుబులాగా కరోనా కూడా వచ్చిపోతుందని చెప్పారు.ఇతర వైరస్ లకు మానవ శరీరం ఏ విధంగా స్పందిస్తుందో కరోనాకు కూడా అదే తరహాలో స్పందించే అవకాశం ఉందని చెప్పారు.
దాదాపు మూడున్నర లక్షల మంది యాంటీబాడీ పరీక్షల ఫలితాలను పరిశీరించి బార్క్ లే ఈ విషయాన్ని వెల్లడించారు.75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో యాంటీబాడీలు త్వరగా తగ్గిపోతాయని.కరోనా నిర్ధారణ అయిన వాళ్లకు గడిచిన నాలుగు నెలల్లో 26 శాతం యాంటీబాడీలు తగ్గినట్టు గుర్తించామని తెలిపారు.లక్షణాలు బయటపడని వారిలో 60 శాతం యాంటీబాడీలు తగ్గిపోయాయని తెలిపారు.మరోవైపు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు కరోనా నుంచి కోలుకున్న వారిలోని యాంటీబాడీలు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని.అయితే ఈ అంశం గురించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరే మార్గం లేదని చెబుతున్నారు.ప్రస్తుతం 100 మందికి కరోనా సోకితే ఇద్దరు నుంచి ముగ్గురు చనిపోతున్నట్టు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.