దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో విజయం సాధించి మంచి జోష్ మీదున్న టీమిండియా.త్వరలో బంగ్లాదేశతో మ్యాచ్లు ఆడనుంది.ఈ క్రమంలో బంగ్లాదేశ్తో జరిగే సిరీస్కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.టీ20తో పాటు టెస్ట్ జట్టును కూడా ఒకేసారి ప్రకటించింది.బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ గంగూలీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సిరీస్ ఇదే కావడం గమనార్హం.
అయితే ఈ సిరీస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొనడం లేదు.
విరాట్ కోహ్లీని ఈ సిరీస్ నుంచి తప్పించి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు కెప్టెన్గా అవకాశం కల్పించారు.పనిభారం నుంచి కాస్త ఉపశమనం ఇచ్చేందుకు గాను విరాట్ కోహ్లీకి బీసీసీఐ కొద్దిరోజుల పాటు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక కేరళ బ్యాట్స్మెన్ సంజు శాంసన్కు అవకాశం దక్కగా.ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య స్థానంలో ముంబై క్రికెటర్ శివమ్ దూబేక్ అవకాశం లభించింది.కాగా, నవంబర్ 3,7,10న మూడు టీ20లు జరగనుండగా.14 నుంచి బంగ్లాతో టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి.