నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ చిత్రంతో చాలా నిరుత్సాహపడ్డాడు.అదే సమయంలో అతడికి ఎన్టీఆర్ చిత్రం చాలా నష్టాలను కూడా మిగిల్చింది.
దాంతో బాలయ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు.దాదాపు అయిదు నెలల తర్వాత బాలయ్య కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది.
నిన్న మొన్నటి వరకు బాలయ్య, బోయపాటిల కాంబోలో మూవీ ఉంటుందని ప్రచారం జరిగింది.అయితే ఆ వార్తలు నిజమే కాని, ముందుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య మూవీ ఉంటుందని ప్రకటన వచ్చింది.
సి కళ్యాణ్ నిర్మాణంలో కేవలం మూడు నెలల్లో ఈ చిత్రంను చుట్టేయబోతున్నారట.
గత ఏడాది బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ల కాంబినేషన్లో ‘జైసింహా’ చిత్రం వచ్చింది.
ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించారు.కాని అనూహ్యంగా ఆ చిత్రం బొక్క బోర్లా పడింది.
డిజాస్టర్గా నిలిచింది.ఏమాత్రం ఆ చిత్రం ఆకట్టుకోలేక పోయింది.
నిర్మాతలకు కూడా లాస్ను మిగిల్చింది.ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇప్పుడు బాలయ్య కోసం రవికుమార్ ఒక మంచి కథను సిద్దం చేశాడు.
ఆ కథకు సంబంధించిన లైన్ బాగుండటంతో వెంటనే బాలయ్య ఓకే చెప్పడం జరిగింది.ఇదే నెలలో సినిమాను ప్రారంభించబోతున్నారు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా హరిప్రియను ఎంపిక చేయడం జరిగింది.
జై సింహా చిత్రంలో ఒక హీరోయిన్గా హరిప్రియ నటించింది.అయితే హరిప్రియ పాత్రకు ఎక్కువగా గుర్తింపు రాలేదు.ఇప్పుడు మరోసారి ఆమెకే బాలయ్య ఛాన్స్ ఇచ్చాడు.
తెలుగులో అస్సలు ఆఫర్లు లేకపోవడంతో కన్నడ సినిమా పరిశ్రమలో ప్రయత్నాలు చేస్తూ ఉన్న హరిప్రియకు ఈ చిత్రం అయినా తెలుగులో సక్సెస్ను ఇస్తుందేమో చూడాలి.ఇదే సమయంలో బాలకృష్ణపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆమె తప్ప మరెవ్వరు బాలయ్యకు దొరకడం లేదా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.మరి బాలయ్య ఎందుకు హరిప్రియను కావాలనుకున్నాడో ఆయనే చెప్పాలి.