ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి.ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.రిజల్ట్ లో 72.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.బాలికలదే పై చేయిగా ఉందని మంత్రి బొత్స తెలిపారు.బాలురు ఉత్తీర్ణత 69.27 శాతం, బాలికల ఉత్తీర్ణత 75.38 శాతం ఉంది.ఏపీ వ్యాప్తంగా 6.5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే.కాగా ఈ పరీక్ష ఫలితాల్లో మొదటి స్థానంలో మన్యం జిల్లా, చివరి స్థానంలో నంద్యాల జిల్లా నిలిచిందన్నారు.అదేవిధంగా టెన్త్ సప్లమెంటరీ పరీక్షలు జూన్ 2 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 13 వరకు అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు.