జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లనుంది.రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుంది.
వాలంటీర్లపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే.వాలంటీర్లపై పవన్ చేసిన కామెంట్స్ పరువు నష్టం కలిగించేలా ఉన్నాయంటుంది.
కాగా ఇటీవల ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో మహిళల అక్రమ రవాణాకు కొందరు వాలంటీర్లు సహకరిస్తున్నారంటూ పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఏపీ సర్కార్ కోర్టుకు వెళ్లనుందని సమాచారం.