టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు అధికారులు నోటీసులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
పేపర్ లీకేజీపై ఆధారాలు ఇవ్వాలని గతంలోనే బండి సంజయ్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈనెల 24న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయనకు మరోసారి నోటీసులు అందించనున్నారని సమాచారం.