ఇలాంటి కరకు విమర్శలు సాధారణంగా ఎవరు చేస్తారో మనకు తెలుసు.ఆయనే వైఎస్సార్సీపీ అధినేత జగన్.
రాజకీయ అనుభవంలో , వయసులో చంద్రబాబు ఎంతో పెద్ద.పరిపాలన అనుభవం జగన్కు జీరో.
అయినప్పటికీ చంద్రబాబును ఎంత మాతపడితే అంత మాట అంటాడు జగన్.ఆయన చేసేవి విమర్శలు కావు.
తిట్టడమే ఆయన పని.విమర్శలు అర్ధవంతంగా ఉండాలి కాని రాయి పెట్టి కొట్టినట్లు ఉండకూడదు.కాని ఈ సంగతి జగన్ అర్థం చేసుకోడు.ఇష్టం వచ్చినట్లు తిడుతోంది జగన్ ఒక్కడే కాదు.అనేకమంది రాజకీయ నాయకులు ఇదేవిధంగా ఉన్నారు.వారిలో జగన్ ఒకడు.
చంద్రబాబు నాయుడు పాఠాలు నేర్చుకునేదాకా తాను ఆయనతో పోరాటం చేస్తూనే ఉంటానని అన్నాడు.విశాఖ అటవీ ప్రాంతంలో బాక్సైటు గనుల తవ్వకాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు చెవులకు వినబడటం లేదని విమర్శించారు.
ఆ జీవోను పూర్తిగా రద్దు చేయకుండా పెండింగులో పెట్టారని అన్నారు.ఈ సందర్భంలోనే బాబును మోసగాడని తిట్టాడు.2011లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు బాక్సైటు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించారని, ఇప్పుడు ఆయనే గనుల తవ్వకానికి అనుమతి ఇచ్చారని జగన్ చెప్పాడు.విశాఖ మన్యంలోని గిరిజనులకు తాను అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చాడు.