BJP : ఢిల్లీలో రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

ఢిల్లీలో రెండో రోజు బీజేపీ( BJP ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.భారత్ మండపం వేదికగా జరిగే ఈ సమావేశాల్లో విపక్ష కూటమి టార్గెట్ గా నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది.

 Bjp National Executive Meeting In Delhi-TeluguStop.com

ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) ప్రసంగించనున్నారు.పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మాట్లాడనున్నారు.

అలాగే బీజేపీ నేషనల్ కౌన్సిల్ లో ఇవాళ మరో తీర్మానం చేయనున్నారని తెలుస్తోంది.కాంగ్రెస్ ఇండియా కూటమి( Congress INDIA Alliance ) నిరాశ రాజకీయాలు అనే పేరుతో చేస్తున్న ఈ తీర్మానాన్ని అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు.ఇందులో భాగంగానే మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Modi ) ప్రసంగం ఉండనుంది.లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా మోదీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube