జెడ్పి స్థాయి సంఘాల సమావేశంలో పలు శాఖలపై సమగ్ర చర్చ

రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు.విద్య, వైద్యం, ప్రణాళిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, నిర్మాణ పనుల స్టాండింగ్ కమిటీలకు జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షత వహించగా, వ్యవసాయం పై వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మహిళా సంక్షేమ పై తంగలపల్లి జడ్పీటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి, సాంఘిక సంక్షేమం పై బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమ కొండయ్య స్టాండింగ్ కమిటీలకు అధ్యక్షత వహించారు.

 Comprehensive Discussion On Various Sectors In The Meeting Of Zp Level Associati-TeluguStop.com

ఈ సమావేశంలో అధికారులు సంబంధిత శాఖల నివేదికలు చదివి వినిపించారు.శాఖల పై సమగ్ర చర్చ జరిగింది.జడ్పీ చైర్ పర్సన్ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో జెడ్పీటిసిలు గట్ల మీనయ్య, మ్యాకల రవి, నాగం కుమార్, కోమిరి షెట్టి విజయ లక్ష్మణ్, గుండం నర్సయ్య, కో ఆప్షన్ సభ్యులు అహ్మద్, ముఖ్యకార్యనిర్వహణ అధికారి గౌతమ్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube