బోయినిపల్లి మండలంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెర పాక కొండయ్య అధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay) దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు .అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై అభిలాష్ కు(SI Abhilash) బండి సంజయ్ పై ఫిర్యాదు చేశారు.

 Burn Effigy Of Bjp State President Bandi Sanjay In Boinipally Mandal , Brs, Bjp-TeluguStop.com

ఈ సందర్భంగా జెడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య మాట్లాడుతూ ఓ మహిళ అని చూడకుండా బండి సంజయ్ మాట్లాడడం సరికాదనీ అన్నారు.ఈడి కేసులో ఎమ్మెల్సీ కవితను ‘అరెస్ట్ చేయకుంటే ముద్దు పెట్టుకుంటారా’ అన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అటువంటి వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ బేశరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .లేనియెడల బండి సంజయ్ ఇంటిని ముట్టడించి క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకాల సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనికటి లచ్చిరెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, సర్పంచ్లు గుంటి లతా శ్రీ, చింధం రమేష్, కన్నం మధు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube