ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈనెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది.
రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ప్రకాశం -నెల్లూరు – చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, కడప – అనంతపురం – కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, శ్రీకాకుళం- విజయనగరం – విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, ప్రకాశం – నెల్లూరు -చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, కడప – అనంతపురం – కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలు జరగనున్నాయి.
కాగా ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.