1.భారతీయుల్లో హైబ్రీడ్ ఇమ్యునిటీ : శాస్త్రవేత్త ప్రకటన
భారతీయుల్లో ఎక్కువమందికి హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ఉందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు.
2.డల్లాస్ లో సిరివెన్నెల కు ఎన్.ఆర్.ఐ సంఘాల అశ్రునివాళి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ), ఆటా, నాటా, నాట్స్, టి.టి.ఎ మరియు టాంటెక్స్ ఆధ్వర్యంలో పద్మశ్రీ చెంబోలు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి డల్లాస్లోని సాహితీ వేత్తలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
3.మహిళ ల కోసం తాలిబన్ల కొత్త చట్టం
ఆఫ్ఘన్ లో మహిళలకు బలవంతపు పెళ్ళిళ్ళు చేయకూడదు అంటూ తాలిబన్ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది.
4.చైనా నుంచి లావోస్ కు రైలు
చైనా ను లావోస్ ను కలిపే రైలు ను ఇరు దేశాల అధినేతలు ప్రారంభించారు.
5.కుక్ ఐలాండ్ లో తొలి ఒమిక్రాన్ కేసు
సౌత్ పెసిఫిక్ లోని కుక్ ఐలాండ్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది.
6.కెనడా లో 15 ఒమిక్రాన్ కేసుల నమోదు
కెనడా లో 15 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.గత నెల 28న తొలి కేసు నమోదు అయ్యింది.
7.యూఎస్ వర్జిన్ ఐలాండ్ లో ముగ్గురు భారతీయుల అరెస్ట్
అమెరికా లో ముగ్గురు భారతీయులను బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది అరెస్ట్ చేశారు.అక్రమంగా వారు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడమే కారణం.
8.కడప వరదలు .నిత్యావసరాలు అందించిన నాటా వైఎస్సార్ అభిమానులు
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు ఎంతో మంది నిరాశ్రయులయ్యారు వారికి తక్షణ సహాయం కింద అమెరికాలోని అట్లాంటా సిటీ నాట అసోసియేషన్, వైయస్సార్ అభిమానులు స్పందించి విరాళాలు అందించారు.
9.38 దేశాలకు పాకిన ఒమిక్రాన్
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వైరస్ 38 దేశాలకు విస్తరించింది.
10.అమెరికా లో వచ్చే వారం నుంచి ఖఠిన ఆంక్షలు
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో అమెరికా అప్రమత్తం అయ్యింది.కొత్త వేరియంట్ ను ఎదుర్కునేందుకు ఖఠిన ఆంక్షలు విధించాలని నిర్ణయించుకుంది.