ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి పేదవాడి కడుపు కొడుతోంది.ఉపాధి హామీ నిధులు వ్యయంపై స్పష్టత లేదు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాల్లో గోతులు పూడ్చడానికి ఉపాధి హామీ నిధులను వినియోగించారు.
ఈ విధంగా రెండు వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం శుభపరిణామం.
కేంద్ర వాటా నిధులను అధికారుల నుంచి వసూలు చేయాలంటూ ఆదేశించడం హర్షణీయం.దీనిపై వెనకడుగు వేయకుండా కేంద్రం చర్యలు తీసుకునేలా రాష్ట్ర బిజెపి నాయకులు ఒత్తిడి తీసుకురావాలి.