టాలీవుడ్ లో మాస్ రాజా అంటూ పిలిపించుకుంటూ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాతో మాస్ మహారాజ రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.
ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ దూకుడు కనబరుస్తున్నాడు.ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ రమేష్ వర్మ.
ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నాడు.రవితేజ కెరీర్ లో ఇది 68వ సినిమాగా తెరకెక్కబోతుంది.
ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేర్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ లు తెలిపారు.
దీంతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.ఇక ఇప్పుడు రవితేజ తన 70వ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేసాడు.ఇంకా పేరు కూడా పెట్టని ఈ సినిమాకు ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగోను నవంబర్ 5న ఉదయం 10.18 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
‘‘హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్” అనే ట్యాగ్ లైన్ తో కూడిన ఆసక్తికర పోస్టర్ ద్వారా రవితేజ తన 70వ సినిమాను ప్రకటించారు.ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది.ఈ పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న పురాతన ఆలయ శిల్పాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ తో పాటు రవితేజ ఆర్ట్ టీమ్ వర్క్ బ్యానర్ పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శ్రీకాంత్ విస్సా పవర్ ఫుల్ కథను అందించారు.