సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట.మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాలో మహేష్ పోకిరి స్టైల్ లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు.అయితే సినిమా మొదలైన దగ్గర నుండి లీకులు బాగా వస్తున్నాయి.
లేటెస్ట్ గా సినిమా నుండి కొన్ని షూటింగ్ పిక్స్, ఓ వీడియో కూడా బయటకు వచ్చింది.ఈ లీకులపై మహేష్ అప్సెట్ అవుతున్నాడని తెలుస్తుంది.
చిత్రయూనిట్ లోనే ఎవరో ఈ లీక్స్ చేస్తున్నట్టు తెలుస్తుండగా దీనిపై మహేష్ సీరియస్ గా ఉన్నాడని టాక్.
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే స్టార్ సినిమాకు ఈ లీకుల గోల తప్పట్లేదు.సినిమా యూనిట్ కు ఎంత స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినా ఎక్కడో ఓ చోట నుండి సినిమా షూటింగ్ పిక్స్, వీడియోలు తీసి లీక్ చేస్తారు.ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట నుండి లీక్డ్ పిక్స్ కొన్ని వైరల్ గా మారాయి.
మహేష్ దృష్టికి ఇది రావడంతో చిత్రయూనిట్ అప్రమత్తం అయ్యింది.షూటింగ్ స్పాట్ లో ఎవరు సెల్ ఫోన్ వాడకుండా రూల్ పెడితేనే ఇలా లీకులు జరగకుండా ఉంటాయని అనుకుంటున్నారు.