ఏసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు.క్రిస్మస్ ఈ వేడుకలను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా అక్కినేని సమంత క్రిస్మస్ సంబరాలలో మునిగి పోయారు.కేరళకు చెందిన సమంత క్రిస్టియన్ కావడంతో క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.
సమంత నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావు సినిమాలో క్రిస్టియన్ అమ్మాయిగా జెస్సీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఆ సినిమా తర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడి అతనినే పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలుగా అడుగుపెట్టిన సమంత రంగు రంగు దుస్తులను ధరించి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు.
అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.సాధారణంగా పెళ్ళి అయిన తరువాత హీరోయిన్లు సినిమాలకు దూరంగా ఉంటారు.కానీ పెళ్లి తర్వాత సమంత సినిమాలలో తన వేగాన్ని పెంచిందని చెప్పవచ్చు.
పెళ్లి తర్వాత కూడా ఒకవైపు చేతినిండా సినిమాలతో, మరొకవైపు వెబ్ సిరీస్ లలో, నటిస్తూ మంచి ఆదరణ పొందిన సమంత లాక్ డౌన్ సమయంలో “ఆహా” యాప్ ద్వారా సామ్ జామ్ అనే టాక్ షోను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.మొదటిసారిగా వ్యాఖ్యాతగా చేస్తున్న సమంత ఈ షో కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.ఇప్పటికే ఈ షో ద్వారా పలువురు సినీ తారలు పాల్గొని వారి వ్యక్తిగత విషయాలను ఈ షో ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు.నేడు క్రిస్మస్ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
సమంత క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.