ఫిదా చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సాయి పల్లవి ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.వరుసగా సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతోంది.
అయితే హీరోయిన్గా మారకముందే సాయి పల్లవి మెడిసిన్ చదివేదని చాలా తక్కువ మందికి తెలుసు.కాగా తాజాగా ఆమె డాక్టర్గా ప్రాక్టీస్ కోసం ఓ పరీక్షను రాయడానికి వెళ్లింది.
అయితే అక్కడ సాయి పల్లవికి చేదు అనుభవం ఎదురైంది.ఫిదా హీరోయిన్ వచ్చిందనే విషయం తెలుసుకున్న కొంతమంది విద్యార్ధులు, ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.ఈ క్రమంలో ఆమె గుంపులో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.దీంతో ఆమె సహాయం కోసం వేరే వారిని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫారిన్ మెడికల్ గ్రాడ్యూయెట్స్ ఎగ్జామినేషన్(FMGE) పరీక్ష రాసేందుకు చెన్నై వెళ్లిన సాయి పల్లవి ఈ విధంగా చేదు అనుభవం ఎదురవ్వడంతో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యింది.
కాగా సినిమాల విషయానికి వస్తే ప్రసుతం సాయి పల్లవి ‘లవ్స్టోరి’, ‘విరాటపర్వం’ చిత్రాల్లో నటిస్తోంది.
ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.ఇక ఈ సినిమాలను త్వరలో రిలీజ్ చేసి అదిరిపోయే సక్సెస్ను అందుకోవాలని ఈ బ్యూటీ చూస్తోంది.
అటు తమిళంలోనూ అమ్మడు తనదైన మార్క్ వేసుకుంటూ దూసుకుపొతుంది.మరి ఈ బ్యూటీ తన లేటెస్ట్ మూవీలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.