ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోతున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెల్సిందే.
ఇప్పుడు మరో అప్ డేట్ ను ఇవ్వబోతున్నట్లుగా స్వయంగా ఓం రౌత్ ప్రకటించాడు.రేపు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు అప్ డేట్ ఇవ్వబోతున్నట్లుగా ఓం రౌత్ ప్రకటించాడు.
ఇప్పటికే సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసిన యూనిట్ సభ్యులు ఒక భయంకరమైన పాత్రకు సంబంధించి అప్ డేట్ ఇవ్వబోతున్నట్లుగా పేర్కొన్నాడు.
ఏడు వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో అత్యంత భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు అంటూ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను ఓం రౌత్ షేర్ చేశాడు.
ఇది రామాయణం అని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది.కనుక రేపు ఇవ్వబోతున్న అప్ డేట్ రావణుడి గురించి అయ్యి ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆదిపురుష్ యూనిట్ సభ్యుల జోరు చూస్తుంటే అన్నట్లుగానే 2022లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఉన్నాడు అనిపిస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో కూడా త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.