భారత్ లో ఎంత కఠినమైన చట్టాలు వచ్చిన మనుషులు మారారు.లంచాలు మరిగిన మనుషులకు మానవత్వం ఉండదు.
అందుకు నిదర్శనమే ఈ ఘటన.పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తరప్రదేశ్లోని బర్హాజ్ ప్రాంతంలోని గౌరా గ్రామానికి చెందిన చేడి యాదవ్ అనే వృద్ధుడు ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు.
దీంతో అతడు తీవ్రమైన గాయాలతో బాధపడుతున్నాడు.
ఇంకా అతడిని దగ్గరలో ఉన్న డియోరియా జిల్లా ఆసుపత్రిలోని సర్జికల్ వార్డులో చేర్చగా బాధితుడు కూతురు, మనవడు కూడా ఆమె వెంటే ఉన్నారు.అయితే కాలికి డ్రెస్సింగ్ చెయ్యాల్సి ఉండగా స్ట్రెచర్ నెట్టేందుకు బిందు వార్డు బాయ్ సాయం తీసుకుంది.
ఆలా సాయం చెయ్యాలి అంటే అతనికి 30 రూపాయిలు చెల్లించాలి అని లంచం అడిగాడు.దీంతో అతడి వద్ద అంత డబ్బు లేదని, ఆ డబ్బు ఉండి ఉంటే ప్రైవేట్ ఆసుపత్రికే వెళ్లేవాళ్లమని చెప్పగా అతడు స్ట్రెచర్ తొయ్యలేదు.
ఇంకా కష్టమైన బాధితుడు కూతురు బిందునే స్ట్రెచర్ తోసుకుంటూ వెళ్లగా అమ్మకు సాయంగా ఆరేళ్ల శివం కూడా స్ట్రెచర్ నెట్టాడు.ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.