నిత్యం వేలాది మంది జనాలతో, ప్రత్యేక సందర్బాల్లో లక్షలాది మంది జనాలతో కిటకిటలాడుతూ ఉండే తిరుమల వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు గత రెండు వారాలుగా జనాలు లేక వెలవెల బోతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.మొన్నటి సంక్రాంతి సెలవుల్లో జనాలు భారీగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.
ఆ తర్వాత సెలవులు పూర్తి అయినప్పటి నుండి కూడా తిరుమలకు జనాల రాక చాలా వరకు తగ్గింది.సాదారణంగా దర్శనంకు నాలుగు నుండి ఆరు గంటల సమయం పడుతుంది.
కాని ఇప్పుడు ఉచిత దర్శనంకు కూడా కేవలం గంట నుండి రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది.
ఇందుకు కారణం మరో నెల రెండు నెలల్లో వేసవి సెలవులు రాబోతున్నాయి.
వేసవి సెలవుల్లో తిరుమలకు వెళ్లాలని చాలా మంది కాచుకుని కూర్చున్నారు.అందుకే తిరుమల కొండలు ఇప్పుడు వెలవెల బోతున్నట్లుగా చెబుతున్నారు.
ఎప్పుడైతే సమ్మర్ హాలీడేస్ ప్రారంభం అవుతాయో అప్పుడే వెంటనే తిరుమల శ్రీవారికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.ప్రస్తుతానికి అయితే భక్తుల రద్దీ తక్కువగా ఉంది.
వీలుంటే ఇప్పుడు వెళ్లడం మంచిదని భక్తుల అభిప్రాయం.గత రెండు వారాలుగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయిందని ఆలయ అధికారులు చెబుతున్నారు.