లేడీ అమితాబ్గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి విజయశాంతి, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీకి సిద్ధమయ్యారు.దర్శకుడు అనిల్ రావిపూడి ఆమె కోసం ఓ స్పెషల్ పాత్రను రాసుకుని ఆమెను సినిమా చేసేందుకు ఒప్పించాడు.
విజయశాంతి రీఎంట్రీ అనగానే ఆమె వరుసబెట్టి సినిమాలు చేస్తారని అందరూ అనుకున్నారు.
కానీ నిజానికి అలా జరగలేదు.
విజయశాంతి కేవలం సరిలేరు నీకెవ్వరు సినిమాను మాత్రమే సైన్ చేశారు.ఈ సినిమా తరువాత ఆమె మరోసారి రాజకీయాల్లో చాలా యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
దీంతో ఆమె వరుసబెట్టి సినిమాలు చేయకపోవచ్చని సినీ వర్గాలు తెలిపాయి.గతంలో విజయశాంతి అందించిన బ్లాక్బస్టర్ల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
సరిలేరు నీకెవ్వరు సినిమాలో భారతీ అనే పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను దీపావళి కానుకగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఏదేమైనా విజయశాంతి వరుసబెట్టి సినిమాలు చేస్తారని అనుకున్న ఆమె అభిమానులకు నిరాశే మిగలనుందని తెలుస్తోంది.రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె మరోసారి యాక్టివ్గా ఉండేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా విజయశాంతి ఏది ఏమైనా సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.