నవగ్రహ దోషాలు ఉన్నవారు గణపతిని ఇలా పూజిస్తే ఆ దోషాలు అన్ని తొలగిపోతాయి

ప్రతి వ్యక్తి జీవితంలోను గ్రహాల కారణంగా శుభ ఫలితాలు,అశుభ ఫలితాలు రెండు ఉంటాయి.శుభ ఫలితాలు ఉన్నప్పుడు ఆనందంగానే ఉంటాం.

అయితే అశుభ ఫలితాలు కలిగినప్పుడు మాత్రం చాలా కాస్త బాధపడుతూ ఉంటాం.అలాంటి ఆశుభ ఫలితాలు కలిగినప్పుడు వాటిని తొలగించుకోవడానికి గణపతిని పూజించాలి.

ఏ గ్రహ దోషం ఉన్నవారు గణపతిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.గణపతిని ఇప్పుడు చెప్పే విధంగా పూజిస్తే దోషాలు అన్ని తొలగిపోతాయి.

సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో వినాయకుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.కేతు దోష నివారణకు తెల్ల జిల్లేడు పూలతో వినాయకుణ్ణి పూజించాలి.

Advertisement

చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాతితో తయారుచేసిన వినాయకుడిని పూజించాలి.

కుజదోష నివారణకు రాగితో తయారుచేసిన వినాయకుడిని పూజిస్తే మంచి ఫలితం త్వరగా కనపడుతుంది.గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో తయారుచేసిన వినాయకుణ్ణి పూజించాలి.బుధ దోష నివారణకు మరకత వినాయకుణ్ణి పూజించాలి.

శుక్ర దోష నివారణకు స్ఫటిక వినాయకుడికి భక్తితో పూజించాలి.రాహు గ్రహ దోషానికి మట్టితో తయారుచేసిన వినాయకుణ్ణి పూజిస్తే ఫలితం ఉంటుంది.

ఇంటిలో సుఖ శాంతులు ఉండాలంటే స్పటిక వినాయకుణ్ణి పూజించాలి.మానసికంగా ప్రశాంతత కలగాలంటే పాలరాతితో తయారుచేసిన వినాయకుణ్ణి పూజించాలి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఆఫర్లు లేక సిరి హన్మంత్ అలా చేసింది.. వైరల్ అవుతున్న నూకరాజు షాకింగ్ కామెంట్స్!

పైన చెప్పిన విధంగా ఎవరికీ ఏ గ్రహ దోషం ఉందో తెలుసుకొని నివారణకు భక్తితో వినాయకుణ్ణి పూజించాలి.ఈ విధంగా చేయటం వలన తొందరగానే మంచి ఫలితం కనపడుతుంది.

Advertisement

తాజా వార్తలు