ఏపీలో టీడీపీ సీనియర్ లీడర్, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ను చంద్రబాబు పక్కన పెట్టేస్తున్నట్టే కనపడుతోంది.ప్రస్తుం రాజమండ్రి ఎంపీగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో తాను మరోసారి ఎంపీగా పోటీ చేసేదే లేదని, ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నానని ఇప్పటికే ఇన్నర్గా ప్రకటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరడంతో పాటు వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ సీటును తన కోడలు రూపాదేవికి ఇవ్వాలని బాబు వద్ద పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.
మురళీమోహన్ కోరికలు ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం రాజకీయంగా ఆయన్ను పక్కన పెట్టేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టే కనపడుతోంది.
వచ్చే ఎన్నికల్లో ఆయనకు బదులుగా ఆయన కోడలు రూపాదేవికి టిక్కెట్టు ఇచ్చే సూచనలు కనపడడం లేదు.ఈ క్రమంలోనే రాజమండ్రి ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థిగా పశ్చిమగోదావరి జిల్ల తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అవంతి ఇంద్రకుమార్ పేరును బాబు పరిశీలిస్తున్నారు.
ఆయన కాకపోతే మరో పారిశ్రామికవేత్త సైతం లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది.ఈ పరిణామాలను బట్టి చూస్తే మురళీమోహన్ కోడలికి అక్కడ టిక్కెట్ దక్కడం కష్టమే.
ఇక ఆయన కోరుతోన్న టీటీడీ చైర్మన్ పోస్టు సైతం ఆయనకు దక్కేలా లేదు.ఈ పోస్టుకు రాజకీయ నాయకుల నుంచి విపరీతమైన పోటీ రావడంతో చిర్రెత్తుకొచ్చిన చంద్రబాబు టీటీడీ చైర్మన్ పోస్టును తాను రాజకీయాల్లో ఉన్నవాళ్లకు ఇవ్వనని ప్రకటించి ఓ షాక్ ఇచ్చారు.
ప్రస్తుతం బాబు దృష్టిలో టీటీడీ చైర్మన్గా తనకు దీర్ఘకాల మిత్రుడు, నాగార్జున కనస్ట్రక్షన్స్ అధినేత ఏవీఎస్ రాజు పేరు ఉన్నట్టు సమాచారం.
ఆయన్ను టీటీడీ చైర్మన్గా నియమిస్తే ఎలాంటి అపవాదులు లేకుండా ఉండడంతోపాటు పారిశ్రామిక వర్గాలకు బాబు పెద్ద పీట వేస్తున్నారనే వార్త తనకు మేలు చేకూరుస్తుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.
అదే జరిగితే మురళీమోహన్తో పాటు ఆయన వారసులకు పొలిటికల్ ఫ్యూచర్ కష్టమే.!
.