టోక్యో ఒలింపిక్స్ లో హాకీ ప్లేయర్ గా అద్భుతమైన ప్రతిభ కనబరచిన ఈ.రజినీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారు.
ముఖ్యమంత్రిని రజినీ కలుగవా ఆమెకు పుష్పగుచ్చం అందించి.శాలువా కప్పి జగన్ సత్కరించారు.
ఆమెకు జ్ఞాపికను కూడా అందించారు.ఒలింపిక్స్ లో ఆమె ప్రదర్శనకు కానుకగా ప్రోత్సహాలను ప్రకటించారు.
రజినీకి పాతిక లక్షలు నగదుతో పాటుగా ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. రజినీకి గతంలో ప్రకటించి పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించారు.
రజినీకి తిరుపతిలో 1000 గజాల నివాస స్థలం, నెలకు 40 వేలు చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వాలని ఆదేశించారు వైఎస్ జగన్.రజినీ స్వగ్రామం చిత్తూరు జిలా ఎర్రావారిపాలెం.ఒలింపిక్స్ లో పాల్గొన్న దక్షిణాది క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.2016 రియో ఒలింపిక్స్ లో కూడా రజినీ పాల్గొన్నారు.భారత్ తరపున ఆమె 110 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడారు.గోల్ కీపర్ గా ఆమె మంచి ప్రతిభ కబరుస్తున్నారు.వైఎస్ జగన్ ఇచ్చిన ప్రోత్సాహకాలతో రజినీ కుటుంబం చాలా సంతోషంగా ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో హాకీలో కాంస్య పతకాన్ని తెచ్చారు.