కేసీఆర్ సభకు హాజరై పోతుండగా ప్రమాదంలో యువకుడు మృతి

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ నియోజకవర్గ కేంద్రం హాలియా పట్టణంలో మంగళవారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరై తిరిగి వెళ్తుండగా హాలియా పట్టణ పరిధిలోని పంగవాని కుంట వద్ద రెండు బైక్స్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పర్వేదుల గ్రామ పరిధిలోని సుద్దభావి తండాకు చెందిన రమావత్ బాలు(25) అక్కడిక్కడే మృతి చెందగా,మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

గాయపడిన యువకుడిని దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Latest Nalgonda News