జుట్టు నల్లగా, షైనీగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు.కానీ, నేటి రోజుల్లో కాలుష్యం, కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రొడెక్ట్స్ను వాడటం, రెగ్యలుర్గా హెయిర్ వాష్ చేసుకోవడం, పోషకాల కొరత, ధూమపానం, ఆహారపు అలవాట్లు, హార్మోన్ల అసమతౌల్యత, ఒత్తిడి వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్ల బడటం, డ్రైగా మారడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
దాంతో వీటిని నివారించుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.ఈ క్రమంలోనే జుట్టు కోసం వేలకు వేల డబ్బును సైతం ఖర్చు పెడుతుంటారు.
అయితే ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే గనుక ఎలాంటి ఖర్చు లేకుండానే జుట్టును నల్లగా, షైనీగా మెరిపించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఇంటి చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని.ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో గుప్పెడు ముందారం పువ్వు రేకలు, రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి పదిహేను నిమిషాల పాటు హీట్ చేయాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.
స్ట్రైనర్ సాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ మిశ్రమంలో రెండు ఎగ్ వైట్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు తలకు మీ రెగ్యులర్ ఆయిల్ను అప్లై చేసి.ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.
గంట లేదా రెండు గంటల పాటు షవర్ క్యాప్ పెట్టేసుకుని.అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి తలస్నానం చేయాలి.
వారంలో ఒకసారి ఇలా చేయడం వల్ల వైట్ హెయిర్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు దూరం అవుతాయి.జుట్టు నల్లగా, షైనీగా మారుతుంది.మరియు కేశాలు ఒత్తుగా, పొడవుగా కూడా పెరుగుతుంది.కాబట్టి, పైన చెప్పిన చిట్కాను అస్సలు మిస్ అవ్వొద్దు.