కరెంట్ షాక్ తో మహిళ మృతి

సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది.ఏఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.

బొప్పారం గ్రామానికి చెందిన పడకంటి అరుణ గురువారం తన తల్లి గారి ఇంటికి శిల్పకుంట్ల గ్రామానికి వచ్చింది.శుక్రవారం ఉదయం 10:30 గంటల సమయంలో తన తండ్రి నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో టేబుల్ ఫ్యాను వైరు ఎడమ చేతికి తగిలి అక్కిడికక్కడే స్పృహతప్పి పడిపోయింది.వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు.

మృతురాలి తండ్రి దేశోజు బ్రహ్మచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించనట్లు తెలిపారు.మృతురాలికి భర్త రమణాచారి,ఒక కుమారుడు ఉన్నారు.

పదేళ్ళు మంత్రిగా చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పు : మాజీ మంత్రి దామోదర్ రెడ్డి
Advertisement

Latest Suryapet News