విజయవాడ కీలక నేత కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.విజయవాడ ఎంపీగా గెలిచి సీఎం జగన్ కు అంకితమిస్తానని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు జగన్ కు కేశినేని నాని ధన్యవాదాలు తెలిపారు.పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తానని పేర్కొన్నారు.
ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేసే బాధ్యత తీసుకుంటానని తెలిపారు.