కరోనా కారణంగా ఒక్కసారిగా ఓటీటీ క్రేజ్ పెరిగింది.ఇండియాలో ఈ నాలుగు నెలల కాలంలో ఓటీటీ మార్కెట్ విపరీతంగా పెరిగింది.
దాంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎక్కువగా ఓన్ కంటెంట్ కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నాయి.తెలుగు నుండి వచ్చిన మొదటి ఓటీటీ అయిన ఆహాను భారీ ఎత్తున జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు అల్లు అరవింద్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకోసం తనకున్న పరిచయాలు ఇంకా అనుభవంతో వెబ్ సిరీస్లను వరుసగా తెరకెక్కించే పనిలో ఉన్నారు.
పలువురు ప్రముఖ దర్శకులతో వెబ్ సిరీస్లను అల్లు అరవింద్ రూపొందించే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.
తాజాగా విరాటపర్వం చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో కూడా ఆహా కోసం అల్లు అరవింద్ ఒక వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నాడట.రానా, సాయి పల్లవిలతో విరాట పర్వం చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసిన దర్శకుడు వేణు ఉడుగు ఆ సినిమా విడుదలకు ఇప్పట్లో పరిస్థితులు అనుకూలించక పోవడం వల్ల వెబ్ సిరీస్ దారి పట్టినట్లుగా తెలుస్తోంది.
ట్యాలెంటెడ్ రచయితగా దర్శకుడిగా వేణుకు పేరు ఉంది.అందుకే ఆయనతో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టి వెబ్ సిరీస్ ను అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడట.ఆహాలో ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలు అయ్యే అవకాశం ఉందట.మొత్తం 15 ఎపిసోడ్స్గా ఈ వెబ్ సిరీస్ ఉంటుందని కూడా సమాచారం అందుతోంది.
మొత్తానికి దర్శకులకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ మంచి అవకాశాలను ఇస్తున్నాయి.