తెలంగాణలో కూడా వారాహి యాత్ర పవన్ కీలక ప్రకటన..!!

జనసేన పార్టీ( Janasena Party ) అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) త్వరలో తెలంగాణలో కూడా “వారాహి” యాత్ర( Varahi Yatra ) చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.అంతేకాదు తెలంగాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

 Varahi Yatra Pawan Key Announcement In Telangana Too Details, Pawan Kalyan, Jan-TeluguStop.com

తాజాగా తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కావడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణలో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు.

ఇదే సమయంలో త్వరలో తెలంగాణలో కూడా “వారాహి” యాత్ర ఉంటుందని పేర్కొన్నారు.జనసేన సత్తా చూపించేలా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో తెలంగాణలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్చార్జులను పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది.ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 14వ తారీకు నుండి “వారాహి” యాత్ర పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేయబోతున్నారు.ఉభయగోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న ఈ యాత్రనీ జనసేన పార్టీ నాయకులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.ఒకో నియోజకవర్గంలో రెండు రోజులపాటు పవన్ కళ్యాణ్ యాత్ర చేయబోతున్నారు.

మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు త్వరలో తెలంగాణలో కూడా “వారాహి” యాత్ర చేపట్టనున్నట్లు పవన్ తాజా ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube