టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ramcharan Tej ) ఉపాసన (Upasana) దంపతులు ఇటీవల ముఖేష్ అంబానీ ( Mukesh Ambani ) కుమారుడు అనంత్ అంబానీ (Ananth Ambani) రాధిక మర్చంట్(Radhika Marchent) ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.ఈ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మూడు రోజులపాటు గుజరాత్ లోని జామ్ నగర్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు అందరూ కూడా హాజరయ్యారు.అంతేకాకుండా కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు.
ప్రముఖ వ్యాపారవేత్తలు క్రికెటర్లు వేడుకలలో పాల్గొన్నారు.
ఇక ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కేవలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం అందింది.దీంతో రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు.ఇక ఆదివారం ఈ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా ముగిసాయి.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఉపాసన ఈ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఈమె అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా నీతా జీ .ముఖేష్ జీ.ఆతిథ్యం మరువలేనిదని తెలియజేశారు.మనస్ఫూర్తిగా మీ కుటుంబానికి మా అభినందనలు అంటూ ఈ సందర్భంగా ఉపాసన ట్విట్టర్ వేదికగా అంబానీ కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ చేస్తున్నటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అలాగే ఈమె షేర్ చేసిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.