వాళ్ళిద్దరూ గోదాలోకి దిగారు

గోదాలోకి దిగడం అంటే కుస్తీ పట్లకు సిద్ధం అయ్యారన్న మాట.కుస్తీ పట్లు పట్టడానికి వీరిద్దరూ పహిల్వానులు కారు.

 Trs, Congress Candidates File Nomination Papers-TeluguStop.com

ఇది ఎన్నికల కుస్తీ.గోదాలోకి దిగిన వారు గులాబీ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్, కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య.

వీరు వరంగల్ ఉప ఎన్నిక కోసం తమ నామినేషన్లు దాఖలు చేశారు.ఇక ప్రచారం ముమ్మరం చేయడమే మిగిలింది.

బీజేపీ – టీడీపీ కూటమి అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు.పగిడిపాటి దేవయ్యను ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది.

మొత్తం మీద ఈరోజో, రేపో తేల్చేస్తారు.వామపక్షాల అభ్యర్థిగా ప్రొఫెసర్ వినోద్ కుమారును చాలాకాలం కిందటే ఎంపిక చేసిన సంగతి తెలుసు.

ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్లు వేయడానికి ఇంకా రెండు రోజాల సమయం మాత్రమె ఉంది.

కాబట్టి బీజేపీ -టీడీపీ కూటమి అభ్యర్థి ఎంపిక ఎట్టి పరిస్థితిలోనూ రేపు జరిగిపోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube