దొంగతనం చేసి కటీశ్వరుడు అవుదామని అనుకున్న ఓ వ్యక్తి దీనికి తగ్గట్లుగా ప్లాన్ చేశాడు.ఢిల్లీలోని ఓ పోస్టాఫీస్లో దొంగతనం చేయడానికి వెళ్లిన ఆ దొంగకు అందులో దొరికిన సొమ్ము చూసి ముర్చపోయినంత పనయ్యింది.
ఇంతకీ ఆ పోస్టాఫీస్లో ఆ దొంగకు ఎంత దొరికిందో అనుకుంటున్నారా? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలయాలంటే అసలు మేటర్లోకి వెళ్లాల్సిందే.
తూర్పు ఢిల్లీలోని మానససరోవర్ పాక్ ప్రాంతంలో ఒక భవనంలో ఉన్న పోస్టాఫీస్కు కన్నం వేశాడు ఓ దొంగ.అయితే ఆ పోస్టాఫీసులో అతడికి క్యాష్ కౌంటర్లో కేవలం రూ.487 మాత్రమే దొరికాయట.దీంతో అతడు నిరాశగా వెనుదిరిగాడు.కాగా మరుసటి రోజున ఉదయం పోస్టాఫీస్ను పోస్టుమాస్టర్ తెరిచి చూడగా కౌంటర్లోని రూ.487 చోరీకి గురైనట్లు గుర్తించాడు.దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
కాగా పోస్టాఫీస్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎలాంటి ఆధారలు లభించలేదని, ఇతర ఆధారల ద్వారా కేసును విచారిస్తామని పోలీసులు తెలిపారు.ఏదేమైనా ఆ దొంగకు మాత్రం అతడికి లాభం దక్కలేదని ఉసూరుమంటూ వెనుదిరిగాడు.