కరోనా వైరస్ వచ్చినప్పుడు దీనికి విరుగుడుగా మందు ఉంటే బాగుండు అని అనుకోని వారుండరు.ఇక ఎన్నో రాత్రులు శ్రమించి కోవిడ్కు వ్యాక్సిన్ కనుగొనగా ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు.
ముఖ్యంగా ఈ టీకాలపై ప్రజలకు సరైన అవగహన లేకపోవడం.ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఏదో జరుగుతుందనే అపోహల వల్ల చాల మంది ముందుకు రాలేని పరిస్దితి మొదట్లో నెలకొంది.
కానీ క్రమక్రమంగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవదానికి చాల మంది ముందుకు వచ్చారు.
ఇప్పటి వరకు ఎందరో ప్రముఖులతో పాటుగా, సామాన్యులు కూడా వేసుకున్నారు.
కానీ చాలా డోసులు వేస్ట్ అయిన్నట్లుగా అధికారులు వెల్లడించిన విషయం గమనించే ఉంటారు.ఇకపోతే ప్రస్తుతం ఈ టీకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇది వరకు టీకా వేసుకోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.కానీ ఇకపై 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే, నేరుగా వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు వెళ్లి డోసులు వేయించు కోవచ్చని స్పష్టం చేసింది.
అయితే ఈ విధానాన్ని అమలు చేసే విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్వేచ్ఛ ఇచ్చామని పేర్కొంది.