హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఇరు పార్టీ శ్రేణుల మధ్య తలెత్తిన వివాదం కాస్త ముదరడంతో తోపులాటకు దారితీసిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడ్డారు.
దీంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.