ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు విచారణ వాయిదా

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

 Temptation Case For Mlas Adjourned-TeluguStop.com

తదుపరి విచారణ వరకు సీబీఐ దర్యాప్తును నియత్రించలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.

ఈ క్రమంలో నిందితులపై నమోదైన కేసులు తీవ్రమైనవని దవే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఈ వ్యవహారం ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించేదన్నారు.

మరోవైపు కేసు వివరాలను సీఎం మీడియా సహా అందరికీ పంపారని బీజేపీ తరపు న్యాయవాది తెలిపారు.కేసు వివరాలు, ఆధారాలు సీఎం స్వయంగా లీక్ చేశారని జఠ్మలాని తెలిపారు.

తమ దగ్గర ఐదు గంటల వీడియో, కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్ లతో పాటు ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయని దవే పేర్కొన్నారు.అనంతరం కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం ఏముందని దవే ప్రశ్నించారు.

ఈ క్రమంలో వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈనెల 27న విచారణ జరుపుతామని ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube