1.టూరిస్ట్ వీసాల పై కువైట్ కీలక నిర్ణయం
టూరిస్ట్ వీసాల పై కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది.జీసీసీ దేశాలలోని విదేశీ నివశయుల తో పాటు , మరో 53 దేశాల వారికి మాత్రమే టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
2.అమెరికా బాటలో భారత్.కీలక ప్రకటన
అమెరికాలో పెట్రో ధరలను తగ్గించేందుకు జో బైడన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.వ్యూహాత్మక నిల్వల నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ను మార్కెట్ లోకి విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆదేశాలు జారీ చేశారు.పెట్రో ఉత్పత్తులు ఎక్కువగా వినియోగించే భారత్, యూకే, చైనా లతో కలిసి ఈ చర్యలు చేపట్టింది.
3.దక్షిణాఫ్రికా లో కొవిడ్ కొత్త వేరియంట్ .భారీగా కేసులు
దక్షిణాఫ్రికా లో కరోనా కొత్త వేరియంట్ కేసులు బయటపడుతున్నాయి.B.1.1.529 అని పిలవబడే ఈ వేరియంట్ చాలా తీవ్ర స్థాయిలో విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది.
4.బ్రెజిల్ లో కరోనా తీవ్రతరం
బ్రెజిల్ లో కరోనా తీవ్రంగా కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో 12,930 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.సైబీరియా బొగ్గు గనిలో ప్రమాదం .11 మంది మృతి
రష్యా లోని సైబీరియా లోని బొగ్గు గనిలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.గని పై కప్పు కూలిన ఘటనలో దాదాపు 11 మంది మృతి చెందారు.
6.స్వీడన్ తొలి మహిళా ప్రధాని రాజీనామా
స్వీడన్ తొలి మహిళా ప్రధాని గా బుధవారం బాధ్యతలు చేపట్టిన మగ్ధాలినా అండర్సన్ 7 గంటల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేశారు.
7.ఆస్ట్రేలియాలో మత వివక్ష వ్యతిరేఖ బిల్లు
మత వివక్ష వ్యతిరేక బిల్లులు ఆస్ట్రేలియా ప్రభుత్వం గురువారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది.
8.ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలనకు వంద రోజులు
ఆఫ్ఘన్ లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి 100 రోజులు అయ్యింది.అయితే అక్కడ ప్రజలకు సరైన సౌకర్యాలు అందక ప్రజలు దొంగచాటుగా ఇతర దేశాల కు పారిపోతున్నారు.
9.భారత్ నుంచి ఆఫ్ఘన్ వెళ్లే వాహనాలకు పాక్ అనుమతి
భారత్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు వెళ్లే వాహనాలు పాకిస్థాన్ గుండా వెళ్లేందుకు పాక్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
10.తెలుగు రాష్ట్రాల్లో అమెరికా తెలుగు అసోసియేషన్ వేడుకలు.ఎన్ ఆర్ ఐ లకు ఆహ్వానం
అమెరికా తెలుగు సంఘం (ATA ) వేడుకలు డిసెంబర్ 5 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి.డిసెంబర్ 24 వరకు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ‘ ఆటా ‘ వివిధ సేవా , సంస్కృతిక కార్యక్రమాలు , సాహితీ సదస్సు లు నిర్వహించనుంది.